సుల్తాన్బజార్ : వేర్వేరు ప్రాంతాలలో రెండు గుర్తు తెలియని మృతదే హాలు లభ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా దవాఖానలోని ఓపీ బ్లాక్ రోగిసహాయకుల వేయింటింగ్ హాల్ వద్ద గుర్తు తెలియని మహిళ (50) మృతదేహం ఉన్నట్లు రౌండ్లలో భాగంగా ఏజైల్ సెక్యూరిటి సూపర్ వైజర్ శ్రీను గుర్తించి దవాఖాన హెల్త్ ఇన్స్పెక్టర్ కంచి మునుస్వామికి సమాచారం అందించారు.
దీంతో అఫ్జల్గంజ్ పోలీసులకు మునుస్వామి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మరో ఘటనలో……..
అఫ్జల్గంజ్ పరిధిలోని మెట్రో ట్రావెల్స్ ఎదురుగా తిరుమల టూరిస్ట్ ముందర ఓ గుర్తు తెలియని వృధ్ధుడి(70) మృతదేహం పడి ఉందని స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కాగా మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ ఫుల్ షర్టు, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.