చండీగఢ్: ఇద్దరు స్నాచర్లను పట్టుకుని కొట్టిన స్థానికులు, ఆగ్రహంతో వారి బైక్కు నిప్పు పెట్టారు.
పంజాబ్లోని లూథియానాలో ఈ ఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం బైక్పై వెళ్తున్న ముగ్గురు స్నాచర్లు ఒక ఫ్యాక్టరీ కార్మికుడి చేతిలోని మొబైల్ను లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. అతడు గట్టిగా కేకలు వేయగా సమీపంలోని ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు స్నాచర్ల బైక్ను అడ్డుకున్నాడు. దీంతో బైక్పై నియంత్రణ కోల్పోయిన ఆ ముగ్గురు కిందపడ్డారు.
కాగా, స్నాచర్లలో ఒకడు తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగతా ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితక బాదారు. ఆగ్రహంతో స్నాచర్ల బైక్కు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులకు ఇద్దరు దొంగలను అప్పగించారు. స్థానికుల దాడిలో గాయడిన స్నాచర్లను అన్షు, రాహుల్గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఆ స్నాచర్లు సేలం తబ్రి ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. స్థానికుల స్టేట్మెంట్ తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని మెహర్బన్ ఎస్హెచ్వో జగదేవ్ సింగ్ తెలిపారు. పారిపోయిన మూడో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.