అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఇసుక టిప్పర్ ద్విచక్రవాహానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నాసాగరం గ్రామానికి చెందిన కర్రిగోపి, కంచికచర్ల పట్టణనానికి చెందిన రాము అక్కడికక్కడే మృతి చెందారు.
మరొక వ్యక్తికి తీవ్రగాయాలు కావడతో నందిగామ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.