హైదరాబాద్ : వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చోటు చేసుకున్నది. రంగులవారిగూడెంకు చెందిన డేనియల్, బాలు అనే ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల వేటకోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు మృతి చెందారు. అయితే, విద్యుత్ తీగలు అమర్చింది ఎవరనేది తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా వన్యప్రాణుల వేట కోసమే డేనియెల్, బాలు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.