చండీగఢ్: స్పాలో పని చేసే ఇద్దరు మహిళలను ఒక పోలీస్, మరో ఇద్దరు బలవంతంగా హోటల్కు తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. హర్యానాలోని రేవారీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర.. రేవారి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నారు. స్నేహితుడు ధర్మేంద్రతో కలిసి వీరిద్దరు ఈ నెల 25న గురువారం రాత్రి స్పాలో పని చేసే ఇద్దరు యువతులు అద్దెకు ఉండే ఇంటికి వెళ్లారు. ఆ మహిళలను బయటకు ఈడ్చి బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. అనంతరం వారిని మరో కారులోకి ఎక్కించి ఒక హోటల్కు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆ ఇద్దరు యువతులపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అక్రమ కేసులు పెడతామని హెచ్చరించారు.
మరునాడు ఒక బాధిత మహిళ ఈ విషయాన్ని స్పా సెంటర్ యజమానికి చెప్పింది. తొలుత భయపడి నోరు విప్పని మరో యువతి కూడా తమపై జరిగిన దారుణం గురించి తెలిపింది. దీంతో స్పా సెంటర్ యజమాని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ అనిల్ను సస్పెన్షన్లో ఉంచారు. హోంగార్డు జితేంద్రపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు డీఎస్పీ మహ్మద్ జమాల్ తెలిపారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఆయన చెప్పారు.