అబిడ్స్ : షార్ట్ సర్క్యూట్తో చుడీబజార్లోని వినాయక మండపంలో మంటలు చెలరేగి మండపం కాలి బూడిదైంది. షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ఎం వెంకటకిషన్ కథనం ప్రకారం…వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుడీబజార్లో ఆనంద్బిరాదర్ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు.
కాగా బుధవారం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మండపాన్ని కాటన్తో తీర్చి దిద్దడంతో మంటలు వెంటనే వ్యాపించి మండపం కాలి బూడిదైంది. మంటలు మరింతగా వ్యాపించకుండా పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పారు.