హైదరాబాద్ : కుమ్రం భీం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టించింది. కాగజ్నగర్ మండలం అంకుశపూర్ వద్ద బైక్పైకి పెద్దపులి దూసుకువచ్చింది. పులి దాడి చేయడంతో బైక్ అదుపు తప్పి యువకుడు కిందపడిపోయాడు. బైక్పై నుంచి పడిపోవడంతో తాహీర్ అనే వ్యక్తి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం పెరుగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాగజ్నగర్లోని చెక్పోస్టు సమీపంలో పులి రోడ్డు దాటుతూ స్థానికుల కంటపడింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని పంజా గుర్తులను గుర్తించారు. గతంలో ఓ గిరిజనుడిపై పులి దాడి చేసి సమీపంలోని కొండపైకి ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే.