Road Accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను గోపాల్ (47), అంజలి (42), స్వాతి (9)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.