కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చొరబడి రూ.4,79,501 రూపాయలను దొంగిలించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్లోని బర్కత్పుర చమన్లో ఉన్నఎస్బీఐ ఏటీఎంలో వారం రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు నగదును దొంగిలించారు.
మంగళవారం రాత్రి బర్కత్పుర ఎస్బీఐ మేనేజర్ మధుగౌతం ఏటీఎంలోని నగదు లెక్క చూడగా రూ.4,79,501 రూపాయలు తేడా వచ్చినట్లు ఫిర్యాదులో పెర్కొనట్లు పోలీసులు తెలిపారు. ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేంద్రన్ తెలిపారు.
నిందితుల కోసం రెండు పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అడిషనల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అదే విధంగా బర్కత్పుర, కాచిగూడ, చెప్పల్బజార్ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలో నిందితున్ని పట్టుకుని తీరుతామని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9490616378, 040-27854778కు సమాచారం ఇవ్వాలని అడిషనల్ ఇన్స్పెక్టర్ కోరారు.