చాంద్రాయణగుట్ట : ఉద్యోగానికి వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునిల్ కుమార్ (25), భార్యతో కలిసి గత కొన్నాళ్లుగా భయ్యాలాల్నగర్లో నివాసం ఉంటున్నాడు.
ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ సెల్స్ మేన్గా పని చేస్తున్న సునిల్ కుమార్ ఈ నెల 6 న ఉదయం ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయిన తిరిగి రాకపోవడంతో భార్య సోని ఫోన్ చేసింది. ఈ రోజు ఇంటికి రాలేను రేపు వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తరువాత కూడా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్ వస్తుంది.
దీంతో ఆందోళన చెందిన భార్య ఉద్యోగం చేసే చోటుతో పాటు స్నేహితులకు సమాచారం అందించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.