పహాడీషరీఫ్ : గుర్తు తెలియని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి గుర్తు పట్టని విధంగా దహనం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే దారిలో ఇండ్టెక్ ప్రహారి పక్కనే 80 శాతం కాలిపోయిన ఓ వ్యక్తి మృతదేహం ఉందని బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సి. వెంకేటేశ్వర్లు, డీఐ అర్జునయ్య, ఎస్సై ప్రభులింగం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 ఏండ్ల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి గుర్తు పట్టకుండా ఉండడానికి ఇక్కడికి తీసుకొని వచ్చి హత్య చేసి ఉంటారని, హత్య చేసిన వ్యక్తులను పట్టుకోవడానికి ఆరు టీమ్లను ఏర్పాటు చేసామన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపడు తున్నట్లు తెలిపారు.