శంషాబాద్ రూరల్ : ఇంటి తాళం పగులగొట్టి నగదు దోచుకుపోయిన సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ వివరాల ప్రకారం మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన దాస శ్రీనివాస్ ఆదివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని కార్వాన్లో జరిగిన ఓ పంక్షన్కు వెళ్లాడు.
రాత్రి వచ్చి చూసే సరికి ఇంటితాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా గుర్తుతెలియని దుండగులు బీరువా పగులగొట్టి అందులో ఉన్న నగదును దోచుకుపోయారు. ఈ చోరికి సంబంధించి సదరు బాధితుడు సోమవారం శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు 16300 రూపాయాలు దోచుకుపోయినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.