పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్లో నివాసముంటున్న షేక్ అమ్జద్ కుమారుడు అబ్దుల్ అహ్మద్( 16 ) మొఘల్పురలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాల ప్రారంభమైనా వెళ్లడం లేదు.
దీంతో తండ్రి ఈ నెల 7న గట్టిగా మందలించాడు. 9న ఉదయం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అహ్మద్ 10 గంటల సమయంలో చెల్లెలు మరియం కు ఫోన్ చేసి సంవత్సరం వరకు ఇంటికి తిరిగి రానని డబ్బులు సంపాదించుకుని వస్తానని చెప్పి పోన్ స్విచ్ఛాప్ చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.