అమరావతి : కుటుంబ కలహాల కారణంగా మహిళా లెక్చరర్పై భర్త హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్ట్స్ కళాశాలలో కామర్స్ బోధిస్తున్న సుమంగళిని ఆమె భర్త పరేశ్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె కోర్టులో విడాకుల కేసు వేశారు. ఈ కేసు కోర్టులో ఉండగానే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తీవ్ర గాయాల పాలైన ఆమెను హుటాహుటినా అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడ్డ భర్త ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.