కాచిగూడ : బ్యాంక్కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోల్నాకలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వీరాచారి కుమార్తె సమంతా పురి అలేఖ్య (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.
సెప్టెంబర్ 27న ఉదయం బ్యాంక్కు వెళ్లి వస్తానని చెప్పి నగదు తీసుకెళ్లిన అలేఖ్య తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇండ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి వీరాచారి గురువారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లోంచి అలేఖ్య వెళ్లే సమయంలో నీలి రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.