హైదరాబాద్ : మియాపూర్ మదీనాగూడలో విషాదం ఘటన జరిగింది. భవనం పైనుంచి కిందపడి పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మియాపూర్ ఎస్ఐ లింగా నాయక్ కుమారుడు సికందర్ ఆడుకునేందుకు భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అంతాసేపు తమ కళ్ల ఎదుటే ఆడుకున్న కుమారుడు మృతి చెందాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.