హైదరాబాద్ : స్కాలర్షిప్స్ పేరిట గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పలువురు విద్యార్థులను మోసం చేసింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 వేలు వసూలు చేసింది. కానీ నెలలు గడుస్తున్నప్పటికీ స్కాలర్షిప్స్ రాకపోవడంతో సదరు సంస్థను విద్యార్థులు నిలదీశారు.
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు.. రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్తాపూర్లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో 1,500 దరఖాస్తులు లభ్యమయ్యాయి. రూ. కోటి వరకు మోసం చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.