వెంగళరావునగర్ : రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీనియర్ స్టాఫ్ నర్సు ఉద్యోగమంటూ అగంతకులు ఓ మహిళను మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేటలోని శ్యామ్కరణ్ రోడ్డుకు చెందిన గౌతమి ఓ ప్రైవేటు దవాఖానాలో నర్సుగా పనిచేస్తుంది.
కాగా గత నెల 25న తన సెల్ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. నగరంలోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాఫ్ నర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అగంతకులు పంపిన నకిలీ వెబ్సైట్లోకి వెళ్లిన గౌతమి తన వివరాలను అందులో నమోదు చేసింది.
అగంతకులు గౌతమికి ఫోన్చేసి పరీక్ష రుసుము రూ.5 వేలు, ప్రొసెసింగ్ ఫీజు రూ. 5 వేలు, కొరియర్ చార్జీలు రూ.10 వేలు, దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం మరో రూ.10 వేలు పంపాలని చెప్పడంతో దఫాల వారీగా మొత్తం రూ.79,596లను తన ఎస్బీఐ ఖాతా నుంచి అగంతకులు పంపిన వెబ్సైట్ ద్వారా బాధితురాలు చెల్లించింది.
అనంతంరం అగంతకుల నుంచి స్పందన లేకపోవడంతో తాన మోసపోయానని గ్రహించిన గౌతమి శనివారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.