జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన బిడ్డను అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహించిన ఓ తండ్రి అల్లుడి తల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల బీట్ బజార్కు చెందిన వెన్న మహేష్ అనే వ్యక్తి తన కూతుర్ని కాపురానికి తీసుకు వెళ్లడంలేదని అల్లుడిని హత్య చేసేందుకు వారికి ఇంటికి వెళ్లాడు.
సమయానికి అల్లుడు దొరకకుండా పారిపోయాడు. దీంతో మహేష్ అల్లుడి తల్లి గట్ల యమున వీపు, నడుము భాగాల్లో కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన యమునను స్థానికులు దవాఖానకు తరలించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.