బెంగళూర్ : సైబర్ నేరాలపై అధికారులు, పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తం చేసినా సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో చెలరేగుతూ అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఆన్లైన్ రెంటల్ స్కామ్తో (online rental scam) స్కామర్లు బెంగళూర్కు చెందిన టెకీని రూ. 60,000కు మోసగించారు. నగరంలోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో అద్దె ఇంటి కోసం బాధితురాలు పలు ప్రముఖ రెంటల్ వెబ్సైట్లలో సెర్చి చేశారు. ఈ క్రమంలో ఆమెను ఇంటి యజమానిగా సంప్రదించిన నిందితుడు బురిడీ కొట్టించాడు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే బాధితురాలు ఐపీబీ ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో నివసిస్తూ రెంట్ కోసం న్యూ ఫ్లాట్లోకి మారాలని యోచిస్తోంది. ఈనెల 17న ఓ ఇల్లు నచ్చడంతో ఆ పోస్ట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ను సంప్రదించింది. ప్రీతం అనే వ్యక్తి ఆమె కాల్ను రిసీవ్ చేసుకుని తాను ఫ్లాట్ యజమానినని నమ్మబలికాడు. ఆమెకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు తాను సిద్ధమని అంగీకరిస్తూ తన తరపున మేనేజర్ అనుపమ్ సింగ్ సంప్రదిస్తాడని చెప్పాడు.
ఆపై సింగ్ బాధితురాలికి ఫోన్ చేసి డిపాజిట్, రెంటల్ అగ్రిమెంట్ పేరుతో డబ్బును పంపాలని కోరాడు. కాల్ సరైనదేనని భావించిన బాధితురాలు అతడు అడిగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది. మరికొద్దిసేపటికి సింగ్ ఆమెకు కాల్ చేసి ఇంతకుముందు చేసిన పేమెంట్ సాంకేతిక లోపం కారణంగా విఫలమైందని, మరోసారి డబ్బు పంపాలని కోరడంతో బాధితురాలు నిలదీయడంతో అతడు కాల్ను డిస్కనెక్ట్ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Drone Attack: రష్యా నగరంపై డ్రోన్ల దాడి.. రవాణా విమానాలు ధ్వంసం