అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రెండుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నర్సీపట్నంలో అప్పన్నదొరపాలెం వద్ద కారు బోల్తా పడి ముగ్గురు చనిపోయ్యారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామం వద్ద లారీని ఆటో ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
నక్కపల్లి వద్ద ఆగిఉన్న వ్యాన్ను బైక్ ఢీకొనటంతో ఒకరు మరణించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.