న్యూఢిల్లీ: సింఘు బార్డర్ హత్య కేసులో నిందితుడికి స్థానిక న్యాయస్థానం ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. శుక్రవారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కోర్టు నిందితుడిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం తెల్లవారుజామున సింఘు బార్డర్లో రైతులు ఆందోళన చేస్తున్న స్థలానికి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది.
రెండు కాళ్లు, రెండు చేతులు నరికేసి మొండెం హోర్డింగ్పై వేలాడుతున్న స్థితిలో స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు సర్వజీత్సింగ్గా గుర్తించి సోనిపట్లోని కుంద్లి ఏరియా నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు పంజాబ్ రాష్ట్రం తార్న్తరన్ జిల్లాలోని చీమ ఖుర్ద్ గ్రామానికి చెందిన లఖ్బీర్ సింగ్గా గుర్తించారు.