శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ స్మగ్లర్ మంగళవారం బంగారం స్మగ్లింగ్కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్ వివరాల ప్రకారం… కువైట్ నుంచి హైదరాబాద్కు ఓ ప్రయాణీకుడు జె9-1403 విమానం లో వచ్చాడు. తను వేసుకున్న ట్రసర్ సీక్రెట్ పాకెట్లో బంగారం దాచి స్మగ్లింగ్కు యత్నించాడు.
కస్టమ్స్ తనిఖీలో దొరికి పోయాడు. 11.49 లక్షల విలువ చేసే 233. 30 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.