శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో తీసుకవచ్చిన స్మగ్లింగ్ బంగారాన్నికస్టమ్స్ అధికారు లు పట్టుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం…ఇద్దరు ప్రయాణీకులు దుబాయ్ నుంచి ఇకె 524 విమానం ద్వార హైదరాబాద్కు వచ్చారు. ఆ ప్రయాణీకులపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.
ప్రయాణీకుల సూట్కేసు ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో స్మగ్లింగ్ బంగారం బిస్కట్లు గుర్తుపట్టకుండా దాచి ఉంచినట్లు గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 6 కిలోల వరకు ఉంటుందని, దానివిలువ రూ. 2.97 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.