శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా విదేశీ కరెన్సీ తరలించేందుకు విఫలయత్నం చేసిన ఇద్దరు సూడాన్ దేశ మహిళా ప్రయాణీకులను సోమవారం అరెస్టు చేశారు. కార్టుమ్ వయా షార్జా నుంచి హైదరాబాద్ కు అరేబియా విమానం జి9-459/0425 లో ఇద్దరు సూడాన్ దేశానికి చెందిన మహిళా ప్రయాణీకులు వచ్చారు.
వారిపై అనుమానం రావడం తో సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకొని కస్టమ్స్కు అప్పగించారు. ఆ మహిళల వద్ద వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి బ్యాగుల్లో 13 లక్షల విదేశీ కరెన్సీ పట్టుబడింది. కరెన్సీ స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.