సంగారెడ్డి : జిల్లాలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రఘురాం ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం కంగిటి మండలం
తడుకల్ గ్రామ శివారులో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. 50 ప్యాకెట్లలో రెండు కిలోల చొప్పున 100 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద ఉన్న రెండు బైకులను స్వాధీనం చేసుకొని నిందితుడు రామ్ సింగ్ ను అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.