జైపూర్ : విద్యాబుద్ధులు నేర్పి చిన్నారులను సరైన దారిలో పెట్టాల్సిన ప్రధానోపాధ్యాయుడే వక్రబుద్ధితో పక్కదారి పట్టాడు. ఆరో తరగతి చదివే బాలిక(11)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది.
బాలికపై కన్నేసిన హెడ్మాస్టర్ తరగతి గదిని శుభ్రం చేయాలని కోరాడు. బాలిక చీపురుతో గదిని శుభ్రం చేస్తుండగా ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. బాలిక భయంతో ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి తెలిపింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కీచక టీచర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.