జైపూర్: స్నేహితురాలిగా ఉండేందుకు నిరాకరించిన 17 ఏండ్ల బాలికపై ఒక విద్యార్థి బ్లేడ్తో దాడి చేశాడు. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి, తనతో స్నేహం చేయాలంటూ 11వ తరగతి విద్యార్థిని గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బాలికపై దాడి కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం స్కూల్ విరామం సమయంలో ఆ విద్యార్థిని తరగతిలోనే ఉన్నది. గమనించిన అతడు క్లాసులోకి వెళ్లి ఆమెపై బ్లేడ్తో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు రక్తం కారడంతో కంగారుపడిన ఆ విద్యార్థిని భయంతో కేకలు వేసింది. దీంతో టీచర్లు, స్కూలు సిబ్బంది వెంటనే ఆ క్లాసులోకి వెళ్లారు. బ్లేడ్ గాయమైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, భయాందోళనలో ఉన్న ఆ బాలిక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని పోలీసులు తెలిపారు. దాడి చేసిన విద్యార్థి వయసు 18 ఏండ్లు ఉండవచ్చని అన్నారు. టీచర్లు, తోటి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి అన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.
.