హైదరాబాద్ : కామారెడ్డి శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలవగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాదవశాత్తు కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురిని చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఘటనకు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.