పహాడీషరీఫ్ : శనివారం లక్ష్మీనర్సింహ్మ అలియాస్ లక్కీ(04)ని దారుణంగా హత్య చేసిన నిందితుడిని పహాడీషరీఫ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న వీరేశ్ ఆచారి (29) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు ఏండ్ల క్రితం భార్య లక్ష్మీతో విభేదాల కారణంగా విడిపోయారు.
భార్య లక్ష్మీ శ్రీరామకాలనీలోనే తల్లి ఇంటి వద్ద ఉంటుంది. తన భార్యను తన వద్దకు రాకుండా వదిన మహేశ్వరి అడ్డుపడుతుందని కోపంతో ఆమె మూడేండ్ల కుమారుడుని ఇందిర సొసైటీ వద్ద పాడుబడ్డ గదిలో ప్లాస్టిక్ వైర్తో మెడకు ఉరివేసి, తలను నేలకోసి కొట్టి దారుణంగా హతమార్చాడు.
20న మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.