రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.