నందిగామ : దీపావళి పండుగా పర్వదినాన చేగూరు గ్రామంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వరుణ్గౌడ్ అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి చేగూరు గ్రామానికి చెందిన మంచన్పల్లి వరుణ్గౌడ్, రాజేశ్, సాయి అనే ముగ్గురు యువకులు బుల్లెట్ బైకుపై షాద్నగర్ వెళ్లి తిరిగి చేగూరుకు వస్తుండగా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి రాగానే ఎదురుగా మరో ద్విచక్ర వాహనం రావడంతో రెండు ద్విచక్ర ఒకదానికోకటి ఢీకొనడంతో చేగూరు గ్రామానికి చెందిన మంచన్పల్లి రాజుగౌడ్ రెండో కుమారుడు వరుణ్గౌడ్(18) అక్కడిక్కడే మృతి చెందాడు.
ఫరూఖ్నగర్కు చెందిన మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావాడంతో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వరుణ్గౌడ్ మృతితో చేగూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది.