బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డిసివిర్ వంటి కీలక ఔషధాల బ్లాక్ దందా యధేచ్చగా సాగుతోంది. రెమ్డిసివిర్ సింగిల్ వయల్ ను రూ 50,000కు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న రాకెట్ గుట్టును మంగళవారం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది రట్టు చేశారు. ఈ కేసులో డివిజనల్ రైల్వే ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులు, ఓ అంబులెన్స్ డ్రైవర్ ను ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు.
డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రెమ్డిసివిర్ కొరతను పసిగట్టిన రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది నిందితులను పట్టుకునేందుకు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్, వార్డు బాయ్ తో కలిసి రెమ్డిసివిర్ వయల్ ను ఓ వ్యక్తికి రూ 50,000కు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.