ముంబై: జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బిల్డర్పై కాల్పులు జరిపి హత్య చేశారు. మహారాష్ట్రలోని పూణేలో సోమవారం ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉండే కత్రాజ్ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు 28 ఏండ్ల బిల్డర్ సమీర్ షేక్పై కాల్పులు జరిపారు. ఉదయం 11.30 గంటలకు ఈటరీ రోహిత్ వాడేవాలే బయట తన బుల్లెట్ బైక్పై కూర్చొని ఉన్న సమీర్ షేక్పై ఆరు బుల్లెట్లు ఫైర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సమీర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గత ఐదేడు నెలలుగా సమీర్ షేక్తో వివాదం ఉన్న మెహబూబ్ బుల్లార్గీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఇంటి నుంచే ఆయనను ఫాలో అయ్యారని, ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.