జగిత్యాల : జిల్లాలోని జగిత్యాల మండలం టి.ఆర్.నగర్లో రమేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. చేతపడి కారణంగానే రమేష్ చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పుల్లయ్య అనే వ్యక్తికి చితకబాదారు. కాగా తానే మంత్రాలతో చంపానని, మళ్లీ బ్రతికిస్తానని పుల్లయ్య ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మృతదేహం వద్ద పుల్లయ్య కొన్ని గంటల పాటు పూజలు చేశాడు. పోలీసులకు విషయం తెలియగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించి, అనుమానితుడు పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పుల్లయ్యను తీసుకెళ్లటంతో మృతుని బంధువుల ధర్నాకు దిగారు. దీంతో జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.