వికారాబాద్ : పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు తప్పకుండా పాటించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ను సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతానికి వికారాబాద్ పట్టణం దగ్గరగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అలాంటివి జరుగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కారం చేయాలని తెలిపారు.
ఫ్రెండ్రి పోలిసింగ్, కమ్యూనిటీ పోలిసింగ్, సీసీ టీవీల ఉపయోగాలు తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజశేఖర్, ఎస్సై సరిత, సిబ్బంది ఉన్నారు.