రంగారెడ్డి : నందిగామ పరిధిలోని ఫార్మా కంపెనీలో ప్రమాదవశాత్తు విషవాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు అభిలాష్ (26) మృతి చెందాడు. వాయువు పీల్చిడంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే, విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.