నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నోయిడా అధికారులు ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు బయట రాష్ట్రాల నుంచి ఎవరైనా వ్యక్తులు మీ ప్రాంతానికి వచ్చినట్లైతే కరోనా సర్వేలెన్స్కు సమాచారం ఇవ్వాలని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రజలను గౌతమ్ బుద్ధనగర్ జిల్లా అధికారులు కోరారు. నివాసితులు కరోనా నియంత్రణ హెల్ప్లైన్ నంబర్ 18004192211కు సమాచారం అందించాలని తెలిపారు. కరోనాకు సంబంధించిన ఇతర సహాయ సహకారాల కోసం కూడా ఈ హెల్ప్లైన్ నంబర్ను వినియోగించవచ్చని జిల్లా వైద్య అధికారులు సూచించారు.