కాచిగూడ : నిషేదిత గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్లోని లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి విక్రమ్సింగ్ (37), చాధర్ఘాట్ ప్రాంతానికి చెందిన ధన్రాజ్(21)లు గత కొన్ని రోజులుగా గంజాయి విక్రయిస్తున్నారు.
కాచిగూడ పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసు కుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు విక్రమ్సింగ్, ధన్రాజ్ కాచిగూడలో గంజాయి ప్యాకెట్లను అమ్ముతుండగా రెడ్హ్యండ్గా పట్టుకున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.