ముంబై: ఒక ప్రసిద్ధ స్కూల్లో చదువుతున్న బాలికను ఒక ప్యూన్ రెండు నెలలుగా టాయిలెట్లో లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్యూన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. గ్రాంట్ రోడ్ ప్రాంతంలోని ప్రముఖ స్కూల్లో 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతుంది. అక్కడ ప్యూన్గా పని చేస్తున్న 35 ఏళ్ల వ్యక్తి ఆ బాలికతో చనువుగా ఉండేవాడు. ఈ సాకుతో జూలై నుంచి ఆమెను టాయిలెట్లో లైంగికంగా వేధిస్తున్నాడు. బాలిక మొబైల్ నంబర్ తీసుకుని వీడియో కాల్ చేసేవాడు. బట్టలు విప్పాలని వేధించేవాడు. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
కాగా, ఆ ప్యూన్ ఆగడాలు భరించలేదని ఆ బాలిక ఇటీవల తన తల్లికి అతడి వేధింపుల గురించి చెప్పింది. దీంతో ఆమె తల్లి ఆ స్కూల్ యాజమ్యానంతోపాటు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లతోపాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.