కాచిగూడ : జల్సాలకు అలవాటుపడి రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువ నేరస్తులపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీయాక్ట్ విధించారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
భవానినగర్, తాలబ్కట్టా ప్రాంతానికి చెందిన షేక్ అహ్మాద్ అలియాస్ అజ్జు (23) రౌడిషీటర్. ఇతనిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులున్నాయి. మొగల్పురలోని అల్టో హోటల్ ప్రాంతానికి చెందిన సయ్యద్ జూబేర్ అలియాస్ ముజ్జు (20) పై 3 కేసులున్నాయి.
ఆగష్టు 13న తెల్లవారు జమూన 4 గంటలకు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన ఆచార్యులు ఇమ్లీబన్ బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెలుతుండగా మార్గమధ్యలో చాదర్ఘట్ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో షేక్ అహ్మాద్, సయ్యద్ జుబేర్, ద్విచక్రవాహనంపై వచ్చి ఆచార్యుని బెదిరించి రూ.22 వేల సెల్ఫోన్ను తీసుకొని పారిపోయారు.
అయితే ఆగష్టు 15న ఇద్దరిని కాచిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వారిపై గురువారం పీడీ యాక్ట్ను నమోదు చేసి జైలుకు తరలించారు.