చాంద్రాయణగుట్ట : ఆటో డ్రైవర్ల ముసుగులో డ్రగ్స్ దందా నడుపుతున్న నలుగురు నిందితులపై చాంద్రాయణగుట్ట పోలీసులు పీడీ యాక్ట్ను నమోదు చేశారు. బుధవారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..
చాంద్రాయణగుట్ట పరిధిలో నివసించే మహ్మద్ ఫిరోజ్, హజర్ అలీ, మజీర్వలీ, షేక్ ఆరీఫ్ పాషా ఈ నలుగురు నిందితులు ఆటో డ్రైవర్ల ముసుగులో కొన్నాళ్లుగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాల మేరకు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.