సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్స పొందుతున్న విద్యార్థులను బుధవారం పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి పరామర్శించారు.
బుధవారం దవాఖానాలోని కులీకుతుబ్షా భవనంలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తదనంతరం దవాఖాన ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంవో డాక్టర్ రఫీతో చిన్నారులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన నవీన్ అనే విద్యార్థి చేతికి ప్లాస్టిక్ సర్జరీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగప్రసాద్ విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించారు.అనంతరం చిన్నారులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు భరోసాను కల్పించారు.