చార్మినార్ : పొట్టి క్రికెట్ కప్ పోటీల సందర్భంగా ప్రతి ఓవర్బాల్పై బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యున్ని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం స్టీల్ బిజినెస్ నిర్వహించే టోలిచౌకి బాల్రెడ్డినగర్కు చెందిన మహ్మద్ అస్ఘర్ (36) ప్రస్తుతం జరుగుతున్న టి 20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా తన స్నేహితులైన బాజీఘర్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రత్యూష్లతోపాటు తన సన్నిహితులను కలుపుకుని క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న టి20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీంల గెలుపోటములు, ఓవర్లోని బాళ్లపై బెట్టింగ్కు పాల్పడుతున్నారు. బెట్టింగ్కు ప్రత్యేకంగా అభివృద్ది చేసిన ఫైర్బుక్.ఐఓ వెబ్సైట్ ద్వార ఫంటర్లను ఆహ్వానిస్తున్నారు.
బాజీఘర్ దుబాయ్లో నివసిస్తూ ఇక్కడ తన స్నేహితుల ద్వార ఫంటర్ల వివరాలను మహ్మద్ అస్ఘర్కు తెలియజేస్తూ వారి వద్ద నుండి నగదును వసూళ్లు చేస్తున్నారు. నిందితుల వ్యవహారంపై విశ్వసనీయ సమచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం మహ్మద్ అస్ఘర్ ఇంటిపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల సందర్భంగా నిందితుని వద్ద నుండి బెట్టింగ్కు సంబంధించిన 1లక్షా 50 వేల నగదును స్వాధీనం చేసు కున్నామని తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఫంటర్లు డిపాజిట్ చేసిన 3లక్షల 92వేల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడిం చారు. బాజీఘర్, ప్రత్యూష్లు పరారీలో ఉండగా మహ్మద్ అస్ఘర్ను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం గొల్కొండ పోలీసులకు అప్పగించామని తెలిపారు.