పాట్నా: బైక్పై వెళ్తున్న రియల్ఎస్టేట్ వ్యాపారిని ఇద్దరు అడ్డగించి గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. బీహార్లోని ముజఫర్పూర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. మృతుడ్ని షియోపూర్ జిల్లాకు చెందిన నవాల్ కిషోర్ సింగ్గా పోలీసులు గుర్తించారు. సీతామార్హి-ముజఫర్పూర్ హైవేలో బైక్పై వెళ్తున్న అతడ్ని బుధవారం ఉదయం 5.30 గంటలకు బైక్పై వచ్చిన ఇద్దరు అడ్డగించారు. తన బైక్ విడిచి పారిపోతున్న అతడ్ని వెంబడించి వెనుకవైపు నిమిషంపాటు కాల్పులు జరిపారు. నిందితులు తమ బైక్ వద్దకు వచ్చి మరో గన్ తెచ్చి మరోసారి కాల్పులు జరిపారని అనంతరం సీతామర్షి వైపు బైక్పై వెళ్లారని పోలీసులు తెలిపారు. కాగా అరుస్తున్న ఒక కుక్కపైనా వారు కాల్పులు జరిపారని, అది కొంత దూరం పరుగెత్తి కుప్పకూలి చనిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ కాల్పుల ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో దీని ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.