NRI Shot Dead | అమెరికాలో దారుణం జరిగింది. ఓ ఫార్మా సంస్థకు చెందిన భారత సంతతికి చెందిన సీఈవో శ్రీరంగ అరవపల్లి (54)ను ఓ దుండగుడు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. న్యూ జెర్సీలోని ప్లెయిన్స్బోరో ప్రాంతంలో ఔరెక్స్ ల్యాబోరేటరీస్ అనే ఫార్మా సంస్థను 2014 నుంచి నడుపుతున్నాడు.
మంగళవారం అర్ధరాత్రి దాటాక పెన్సిల్వేనియాలోని ఓ క్లబ్లో క్యాసినో ఆట పూర్తయ్యాక దాదపు 10 వేల డాలర్లతో శ్రీరంగ బయలుదేరాడు. ఈ డబ్బను దొంగిలించాలని ఓ దుండగుడు క్యాసినో క్లబ్ నుంచి వెంటాడాడు.
80 కిమీ దూరంలో గల తన ఇంట్లోకి ప్రవేశిస్తున్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడిని జెకాయ్ రీడ్ జాన్ అని పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.