Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింపు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. కవిత అనే యువతికి గత ఏడు నెలల కిందట కాటేదాన్కు చెందిన చంద్రశేఖర్తో పెళ్లి జరిగింది. వరకట్నం తేవాలని అత్తమామలతో భర్త పాటు మానసికంగా, శారీరకంగా వేధించేవారని కవిత కుటుంబీకులు ఆరోపించారు. అలాగే ఆడపడుచు సూటిపోటి మాటలతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబం వాపోయింది. కవిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త చంద్రశేఖర్తో పాటు అత్తామామలు, ఆడపడుచుపై 304(బీ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.