ముంబై : ఓడలో రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేపట్టిన దాడుల్లో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా పలువురు పట్టుబడటం కలకలం క్రమంలో ఈ కేసులో మంగళవారం ఎన్సీబీ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ మొత్తం అరెస్ట్ల సంఖ్య 12కి చేరింది.
ముంబై నుంచి గోవా వెళుతున్న కొర్డెలియా క్రూయిజ్లో జరుగుతున్న రేవ్ పార్టీని ఎన్సీబీ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను వైద్య పరీక్షల కోసం జేజే ఆస్పత్రికి తరలించి తర్వాత ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. నిందితులను అబ్దుల్ ఖాదిర్ అబ్దుల్ ఖయ్యూం షేక్ (30), శ్రేయాస్ సురేంద్ర నాయర్ (23), మనీష్ ఉదయరాజ్ దరియా (26), అవిన్ సాహూ (30)గా గుర్తించారు.