కోల్కతా : ఏడాది కాలంగా మహిళకు అశ్లీల మెసేజ్లు పంపుతున్న యువకుడిని పశ్చిమ బెంగాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుకంత్ సుశాంత్ బిశ్వాస్ (26) అంతర్జాతీయ సిమ్ కార్డును ఉపయోగించి విదేశీయులు సహా పన్నెండు మందికి పైగా మహిళకు అశ్లీల మెసేజ్లు, ఫోటోలు పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నదియా జిల్లాలో పట్టుబడ్డ నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్పై ముంబైకి తరలించారు. అతడి మొబైల్ పోన్ను కలినా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వ్యాపార నిమిత్తం సంప్రదింపుల కోసం ఫేస్బుక్లో బాధితురాలు, జ్యువెలరీ డిజైనర్ తన నెంబర్ను పోస్ట్ చేయగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె నెంబర్కు నిందితుడు నగ్న చిత్రాలు పంపాడు. మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఆపై పోలీసులు నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా ఐపీ వివరాల ద్వారా సమాచారం సేకరించడంతో నిందితుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టు వెల్లడైంది.
ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా శాంతిపూర్కు చెందిన బిశ్వాస్గా గుర్తించారు. ఆపై అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు స్ధానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.అబుదాబిలో పనిచేస్తుండగా సిమ్ కార్డును కొనుగోలు చేసిన బిశ్వాస్ మహిళలకు అశ్లీల మెసేజ్లు, నగ్న చిత్రాలు పంపేందుకు ఆ నెంబర్ను వాడుతున్నాడు. మహిళల నెంబర్లను తాను ఫేస్బుక్ నుంచి సేకరించానని నేరాన్ని అంగీకరిస్తూ బిశ్వాస్ వెల్లడించాడు. లైంగిక వేధింపులు సహా వివిధ సెక్షన్ల కింద బిశ్వాస్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.