సంగారెడ్డి : ఓ తల్లి తన ఇద్దరు పిల్లల గొంతునులిమి చంపింది. ఈ విషాద సంఘటన సంగారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. కొడుకులిద్దరిని చంపిన అనంతరం తల్లి జోత్స్న ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారుల మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు దేవాన్ష్(6), రుద్రాంష్(4)గా గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.